మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

17 Dec, 2018 08:00 IST|Sakshi

శ్రీకాకుళం :జిల్లాలో దాదాపు 2.50 లక్షల మంది మత్స్యకారులున్నారు. వీరి జీవన విధానం నానాటికి దిగజారిపోతోంది. ఇప్పటికే వరుస తుపానులతో ఇబ్బందులు పడుతున్నాం. వేట లేక వలసలు పోతున్నారు. దీనిని మీరు గుర్తించాలి. మా కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. బోట్లు నిర్వహించేవారికి వేట నిషేధ సమయంలో ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తున్నారు. బోట్లు లేని మత్స్యకారులకు కూడా పరిహారం ఇవ్వాలి. ఆర్టీసీలో మత్స్యసంపద రవాణాకు అవకాశం కల్పించాలి.   – లండ ఎర్రయ్య, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు, పోలాకి మండలం

మరిన్ని వార్తలు