జస్టిస్‌ మంజునాథ రాజీనామా

23 Mar, 2018 09:24 IST|Sakshi
సీఎం చంద్రబాబుతో జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ(పాత చిత్రం)

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మెయిల్‌ రూపంలో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌లకు పంపారు. రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినందున, ఇక తనకు పనిలేదని, అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కమిషన్‌కు చైర్మన్‌గా నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు