గవర్నర్‌తో జస్టిస్‌ ఈశ్వరయ్య భేటీ 

24 Sep, 2019 04:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ ఉన్నత విద్యా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వంగల ఈశ్వరయ్య సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఆయన.. ఏపీలో ఉన్నత విద్య బలోపేతంపై చర్చించారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన విషయాన్ని జస్టిస్‌ ఈశ్వరయ్య ప్రస్తావించారు. ఆయన ఉన్నత విద్య కమిషన్‌ చైర్మన్‌గా రాణించాలని తమిళిసై ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ విద్యావంతుల వేదిక కో ఆర్డినేటర్‌ విజయ్‌ భాస్కర్‌ గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.  

>
మరిన్ని వార్తలు