ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ను అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విభజన నాటకం ఆడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవర్థన్రెడ్డి శనితవారం చెన్నైలో ఆరోపించారు. అన్ని ప్రాంతాల హక్కుల కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు చేస్తున్న పోరాటం సమైక్యాంధ్ర సాహసంగా ఆయన అభివర్ణించారు.
అధికార కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం పోరాడుతుంటే, ప్రతిపక్షం టీడీపీ మాత్రం రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకెళ్లుతుందని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికి నిలిచే ఉంటారని కాకాణి గోవర్థన్రెడ్డి తెలిపారు.