కళానికేతన్లో చోరీ ఛేదించిన పోలీసులు

13 Jun, 2015 09:29 IST|Sakshi
కళానికేతన్లో చోరీ ఛేదించిన పోలీసులు

విజయవాడ: నగరంలోని కళానికేతన్లో నగదు చోరీ కేసును పోలీసులు శనివారం ఛేదించారు. నిందితుడు కళానికేతన్లోని సేల్స్ బాయ్ అని పోలీసులు గుర్తించారు. అనంతరం అతడని అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారణ జరిపారు. అంతే పని చేసే షాపులో చోరీ చేసింది తానే అని పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. చోరీ చేసిన రూ. 7.5 లక్షల నగదుకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ బందరు రోడ్డులోని కళానికేతన్ లో జూన్ 10వ తేదీ అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. షాపులో ని రూ. 7.5 లక్షలు నగదు చోరీ జరిగింది. జూన్ 11వ తేదీ ఉదయం దొంగతనం జరిగిన సంగతి గుర్తించిన యజమానాలు వెంటనే మాచవరం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిబ్బందే ఈ చోరీ చేసి ఉండవచ్చని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు