జగన్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

5 May, 2017 01:16 IST|Sakshi
జగన్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి
స్విస్‌ చాలెంజ్‌ గురించి మంత్రులకే తెలీదు


నెల్లూరు (బారకాసు): రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి స్విస్‌చాలెంజ్‌ విధానంపై ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి అన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురు వారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

స్విస్‌ చాలెంజ్‌ గురించి సీఎం చంద్రబాబు మంత్రివర్గానికే సరైన సమాచారం, అవగాహన లేదన్నారు. ప్రతిపక్షనేత అడిగిన దాంట్లో తప్పేముందని, ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రతి విమర్శలు చేయడం సరికాదన్నారు. పాలనలోని పొరపాట్లు, తప్పులను ఎత్తి చూపే హక్కు ప్రధాన ప్రతిపక్ష నేతకు ఎంత ఉందో సమాధానం చెప్పాల్సిన అవసరం సీఎంకి అంతే ఉందన్నారు. జగన్‌ రైతుదీక్ష చేయడం సబబేనని కర్నాటి చెప్పారు.
 

మరిన్ని వార్తలు