వరంగల్ కోర్టుకు హాజరు కానున్న కేసీఆర్

27 Jan, 2014 08:25 IST|Sakshi
వరంగల్ కోర్టుకు హాజరు కానున్న కేసీఆర్

వరంగల్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేడు వరంగల్ కోర్టుకు హాజరు కానున్నారు. పరకాల శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసు విచారణ నిమిత్తం ఆయన నేడు కోర్టుకు రానున్నారు. 2012 మే 20న ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివిధ వర్గాలు, కులాలు, మతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారనే అభియోగాలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కేసీఆర్ తరపున న్యాయవాది రవికుమార్ వాదించనున్నారు.

కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 9 గంటలకు మడికొండకు చేరుకోనున్నారు. అనంతరం హన్మకొండలోని పార్టీ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకుని తర్వాత కోర్టుకు హాజరవుతారు. మధ్యాహ్నం భోజనం అనంతరం హైదరాబాద్ తిరిగి వెళతారు.
 

మరిన్ని వార్తలు