బస్సులు ఆపేస్తా.. పార్టీ ముఖ్యం: కేశినేని నాని

26 Mar, 2017 13:36 IST|Sakshi
బస్సులు ఆపేస్తా.. పార్టీ ముఖ్యం: కేశినేని నాని

విజయవాడ: రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి ఘటన దురదృష్టకరమని టీడీపీ నాయకులు కేశినేని నాని, బోండా ఉమామహేశ్వరావు అన్నారు. నిన్న జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబును కలిసి వారు వివరణ ఇచ్చారు. సీఎంతో భేటీ తర్వాత వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు.

నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. సీఎం తమను మందలించారని చెప్పారు. రవాణా శాఖ కమీషనర్ ను కలిసి విచారం వ్యక్తం చేస్తామని, తమకు ఎలాంటి బేషజాలు లేవని అన్నారు.  

తాము ఎవరినీ దూషించలేదని ఎంపీ కేశినేని నాని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే తన బస్సులను ఆపేయడానికి సిద్ధమని, తనకు పార్టీ ముఖ్యమని ప్రకటించారు. పొరపాట్లు జరిగివుంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.