సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు మరో వారం మాత్రమే ఉండటంతో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ విజయ్ కుమార్ అభ్యర్థులకు పలు కీలకమైన సూచనలు చేశారు. పరీక్ష రాసే గంట ముందే అభ్యర్ధులు ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని సూచించారు. ‘సాక్షి’ మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడారు.
(చదవండి : సచివాలయ ఉద్యోగ పరీక్షలకు తేదీల ఖరారు)
పరీక్షహాల్లోకి సెల్ఫోన్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించేది లేదని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. హాల్టికెట్, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తెచ్చుకోవాలని చెప్పారు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, దళారీలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4వేల 478 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, దాదాపు 22 లక్షల మంది పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు కూడళ్లలో, బస్టాండ్లలో రూట్మ్యాప్లు ఏర్పాటు చేయనున్నామని విజయ్ కుమార్ తెలిపారు.
అభ్యర్థులు తెలుసుకోవాల్సినవి..