సంపులో పడి చిన్నారి మృతి

13 Dec, 2015 21:20 IST|Sakshi

గుంతకల్లు రూరల్ (అనంతపురం): నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం డోనెముక్కల రోడ్డులోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న చర్చి దగ్గరకు వెళ్లిన గోవర్ధన్ (2) అక్కడ నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన సంపులో పడి మృతి చెందాడు.

మరిన్ని వార్తలు