ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆదేశాలిచ్చారు. కాగా, కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి నరసరావుపేటకు తరలిస్తున్నారు. కార్యకర్తల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఈ మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఉంచనున్నారు. రేపు (బుధవారం) నరసరావుపేటలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సోమవారం హైదరాబాద్లో అనుమానాస్పదరీతిలో కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు...
మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య