28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

11 Mar, 2017 03:24 IST|Sakshi
28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 29న ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. 28న ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనం నిలిపివేసి ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు.


అనంతరం ఉదయం 11 గంటలకు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా ఆరోజు నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు.

>
మరిన్ని వార్తలు