కుప్పం సాక్షి విలేకరిపై అగంతకుల దాడి!

19 Sep, 2014 00:23 IST|Sakshi
కుప్పుం: చిత్తూరు జిల్లా కుప్పుం 'సాక్షి' విలేకరిపై అగంతకులు గురువారం రాత్రి  దాడి చేశారు.  బైక్ పై వెళ్తున్న వెంకటాచలంను అగంతకులు కత్తులతో దాడి చేసినట్టు సమాచారం. అగంతకుల దాడిలో గాయపడిన వెంకటాచలం పరిస్థితి విషమంగా మారిందని ఆయన బంధువులు తెలిపారు. 
 
వెంకటాచలం పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వెంకటాచలం దాడి వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 
మరిన్ని వార్తలు