తిరుమల: తిరుమలలో లడ్డూ దళారీలను టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. భక్తులకు లడ్డూలను అధిక ధరలకు విక్రయిస్తున్న 12 మందిని పట్టుకున్నారు. తిరుమలలో ఫేక్ డిటెక్షన్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, మూడంచెల భద్రతను కట్టుదిట్టం చేస్తామని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రవికృష్ణ తెలిపారు. కాగా, లడ్డూ దళారీలను కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.