లగడపాటి మంచి పనే చేశారు

13 Feb, 2014 16:36 IST|Sakshi
లగడపాటి మంచి పనే చేశారు

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేసి మంచిపనే చేశారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లును ఎవరి ఆమోదం లేకుండానే లోక్సభలో ప్రవేశపెట్టేసినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించినప్పుడు ఆయన తనకు తోచినట్లుగా నిరసన వ్యక్తం చేయాలనుకున్నారని, అందుకోసమే పెప్పర్ స్ప్రే చేశారని చెప్పారు.

''లగడపాటి గారు చేసినది మంచిపని. పెప్పర్ స్ప్రే తీసుకుని కొట్టారు. దానివల్ల ఎవరికీ హాని జరగదు, ఎవరూ చనిపోరు. ఈ మధ్యకాలంలో అక్కచెల్లెమ్మలు ఒంటరిగా పోయేటప్పుడు తమ ఆత్మ రక్షణ కోసం దాన్ని తీసుకెళ్తున్నారు. అది చల్లినప్పుడు కాస్త కళ్లు మండుతాయి, దగ్గు వస్తుంది. అంతేగానీ, ఎవరూ చనిపోరు. అన్యాయాన్ని ప్రతిఘటించడానికి ఒక నిరసన వ్యక్తం చేయాలని ఆయన ఇలా చేసి చూపించారు. అదేం తప్పుకాదు'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు