తెలంగాణ ఇవ్వకపోతే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి అన్నారు. తమపార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తన జెండా ఉండదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్యాకేజీకి నిధులు ఎక్కడ నుంచి తెస్తామని కోర్ కమిటీ ప్రశ్నించిందని వెల్లడించారు.
ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుతో ఎలాంటి ప్రయోజనం ఉండదని కేంద్ర జలవనరుల సంఘం, ప్రధానమంత్రి చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే దేశవ్యాప్తంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న సీడబ్ల్యూసీ సభ్యుడు సంజీవరెడ్డి అభిప్రాయానికి అంతగా విలువ ఉండదని కొట్టిపారేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓ జోకర్ అని, ఆయన కాంట్రాక్టరే తప్ప రాజకీయ నాయకుడు కాదని పాల్వాయి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.