ఆస్పత్రి వద్ద లాఠీచార్జి

30 Aug, 2013 05:11 IST|Sakshi

విజయమ్మ, భారతిలను లోనికి అనుమతించకపోవడంతో జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహించారు. ఆస్పత్రి గేటు ఎదుట ధర్నాకు దిగారు. దాంతో వారిపై పోలీసులు లాఠీచార్జికి దిగారు. ఎట్టకేలకు జైలు అధికారుల ఆదేశాల మేరకు రాత్రి 1.00 గంటల సమయంలో విజయమ్మ, భారతి వాహనాన్ని ఆస్పత్రిలోకి అనుమతించారు. వారిద్దరు జగన్‌తో అరగంట పాటు మాట్లాడి వచ్చారు.

>
మరిన్ని వార్తలు