న్యాయవాదుల సంఘీభావం..

22 Oct, 2018 07:21 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన న్యాయవాదులు

విజయనగరం : దాదాపు ఏడాది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బొబ్బిలికి చెందిన న్యాయవాదులు అమరపు రామకృష్ణ, దాసరి అప్పలరాజు, చందక సూర్యనారాయణ, అల్లాడ నగేష్‌కుమార్, శనపతి శ్రీనివాసరావు, గండి శ్రీనివాసరావు, తదితరులు సంఘీభావం తెలిపారు. ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని బొబ్బిలి మండలంలోని పారాది వద్ద ఆదివారం కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సంక్షేమ పాలన అందుతుందని అభిప్రాయపడ్డారు.  – ప్రజా సంకల్పయాత్ర బృందం

>
మరిన్ని వార్తలు