సాక్షి, విజయనగరం: ప్రజాసంకల్పయాత్ర చేస్తోన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదివారం బొబ్బిలి బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర దేశ రాజకీయాల్లో విశిష్టమైనదిగా పేర్కొన్నారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎర్రటి ఎండలో పాదయాత్ర చేసి, ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను చూసిన ప్రజల కష్టాలు తీర్చేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మూడు వేల కిలో మీటర్ల పైగా సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయమన్నారు.