వన్నెపూడిలో వైఎస్సార్‌ సీపీలో 200 మంది చేరిక

3 Aug, 2018 07:33 IST|Sakshi
కందా నాగబాబు ఆధ్వర్యంలో జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన కార్యకర్తలు

తూర్పుగోదావరి  ,గొల్లప్రోలు: మండలంలోని వన్నెపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో గ్రామంలో టీడీపీకి పెద్ద దెబ్బే తగిలింది. గ్రామానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకులు, చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య జిల్లా కార్యదర్శి  కందా సుబ్రహ్మణ్యం (నాగబాబు) వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. నాగబాబు ఆధ్వర్యంలో సుమారు 200 మంది టీడీపీని వీడి, వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కందా సత్యనారాయణ, బెల్లంకొండ అప్పారావు, కందా రాములు, ప్రకాశరావు, రామన్నదొర, వెంకట్రావు, సూర్యనారాయణ, రాములు, అప్పలరాజు తదితరులు ఉన్నారు. టీడీపీలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని నాగబాబు తెలిపారు. వైఎస్సార్‌ సీపీతోనే కాపులకు న్యాయం జరుగుతుందన్నారు. కాపులకు రూ10వేల కోట్లు ప్రకటించడం హర్షించదగిన విషయమన్నారు. స్థానిక పార్టీ నాయకులు కందా చినబాబు, కందా బాబ్జీ  తదితరులు పాల్గొన్నారు.

టీడీపీకి కంచుకోటగా ఉన్న వన్నెపూడి గ్రామంలో ఇప్పుడు ఆ పార్టీకి చెందిన 200 మంది కార్యకర్తలు పార్టీని వీడడం కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. పార్టీలోని అంతర్గత విభేదాలు, ఏళ్ల తరబడి ఒకే కుటుంబం అధికారం చెలాయించడంపై పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు.

మరిన్ని వార్తలు