ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వామపక్షాలు బుధవారం ఆందోళనకు దిగాయి. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వాలంటూ వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ఏలూరు ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. ఈ ప్రభుత్వం పేదలను విస్మరిస్తుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఏలూరు ఎమ్మార్వో ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు.