చిరుత దాడి : 15 గొర్రెలు మృతి

23 Mar, 2015 11:28 IST|Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. చిట్టెపల్లి గ్రామంలో గొర్రెల మందపై సోమవారం చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 15 గొర్రెలు మృతిచెందాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.
 

మరిన్ని వార్తలు