‘మునిసిపాలిటీ ఎన్నికల్లో సత్తాచాటాలి

2 Aug, 2013 03:57 IST|Sakshi

మహబూబాబాద్, న్యూస్‌లైన్ : రానున్న మునిసిపాలిటీ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను అధిక మెజారి టీతో గెలిపించి సత్తాచాటాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ యాప సీతయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మానుకోటలో గురువారం పార్టీ పట్టణ కమిటీ సమావే శం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరై సీతయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆరోపించా రు. నిరుపేదల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా పాలకులు ఆచరణలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
 
 మానుకోట మునిసిపాలిటీ సమస్యలకు నిలయంగా మారిందని, కోట్లాది రూపాయలతో పట్టణాన్ని  అభివృద్ధి చేస్తామని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా యని విమర్శించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన  ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఈనెల 11న పార్టీ ఆధ్వర్యంలో జరిగే నవ భారత యువ భేరి బహిరంగ సభకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీతోపాటు జాతీయ నా యకులు హాజరవుతున్నారన్నారు. పార్టీ నాయకు లు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయా లని  పిలుపునిచ్చారు. నాయకులు  రాఘవులు పాపారావు, లక్ష్మణ్‌రావు, దార వెంకటేశ్వర్లు, భద్ర య్య, శ్రీధర్, శ్రీనివాస్, ఆదిల్, వెంకన్న, వెంకట్, పృథ్వీరా జ్, శ్రీనివాస్, శ్రీకర్, సందీప్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు