తెలంగాణకు విద్యుత్‌ ఆపేద్దాం!

20 Apr, 2017 02:18 IST|Sakshi

సీఎస్‌తో సమావేశంలో అధికారులు

సాక్షి, అమరావతి: తెలంగాణకు విద్యుత్‌ నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉన్నతాధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. ఏపీకి రావాల్సిన బకాయిలపై అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిశ్చయించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ నేతృత్వంలో వెలగపూడిలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్‌ వివాదాలపై చర్చించారు.

మరిన్ని వార్తలు