నందిగామ: విద్యుత్ స్తంభంపై మరమ్మతు పనులు చేస్తూ కింద పడిపోవడంతో ఓ అసిస్టెంట్ లైన్మెన్కు తీవ్ర గాయాలు అయ్యాయి. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన అసిస్టెంట్ లైన్మెన్ సూరిబాబును విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.