సాక్షి, అమరావతి : న్యూ ఇయర్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం పొంగిపొర్లనుంది. అర్థరాత్రి ఒంటి గంట వరకూ బార్లు, వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో ఎక్సైజ్ శాఖ నిర్ణయం అమలు కానుంది.
కాగా, ఇప్పటికే ఏపీలోని మద్యం గోడౌన్లకు రూ. 314.65 కోట్ల లిక్కర్ను తరలించారు. న్యూ ఇయర్ను క్యాష్ చేసుకుని ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎక్సెజ్ శాఖ ఈ అనుమతులు జారీ చేసినట్లు అర్థం అవుతోంది. గతేడాది న్యూ ఇయర్కు సందడికి రూ. 252 కోట్లు విలువైన మద్యం దుకాణాలకు వెళ్లగా.. ఇప్పడు అది రూ.314.65కు పెరిగింది. ఓవరాల్గా 2017లో ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాలు 24.85 శాతం పెరిగాయి.