-

ముస్లిం మైనారిటీల అభివృద్ధికి అండగా ఉంటాం

29 Jul, 2014 03:25 IST|Sakshi
ముస్లిం మైనారిటీల అభివృద్ధికి అండగా ఉంటాం

పుంగనూరు: ముస్లిం మైనారిటీల అభివృద్ధికి అండగా ఉంటా మని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సోమవారం వేర్వేరుగా ప్రకటనలు విడు దల చేశారు. రంజాన్ పండు గ సందర్భంగా జిల్లాలోని ముస్లిం మైనార్టీలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభాకాం క్షలు తెలిపారు. అలాగే ఎంపీ మిధున్‌రెడ్డి రాజం పేట, చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ముస్లిం మైనార్టీలకు శుభాకాంక్షలు తెలిపా రు.

ముస్లిం మైనార్టీలు సత్యనిష్టతో ఉపవాసాలు ఉంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడా రు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి ముస్లింలు రంజాన్ పండుగ ను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు