మాజీ సైనిక ఉద్యోగులకు రుణాలివ్వాలి

11 Dec, 2018 07:32 IST|Sakshi

శ్రీకాకుళం :దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తరహాలో మాజీ సైనిక ఉద్యోగులకు పావలా వడ్డీకే వ్యక్తిగత రుణం మంజూరు చేయాలి. వైఎస్సార్‌ హయాంలో రూ.5లక్షలు వ్యక్తిగత రుణం మంజూరయ్యేది. టీడీపీ హయాంలో ఎటువంటి రుణాలు మంజూరు కావడం లేదు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాజీ సైనిక ఉద్యోగులకూ వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలి.– యండ రమేష్, మాజీ సైనిక ఉద్యోగి, శ్రీకాకుళం.

రుణ సదుపాయం కల్పించాలి
యాదవులకు రుణ సదుపాయంతోపాటు గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలి. మా ఇల్లు 2013లో కాలిపోయినా పార్టీ కక్షతో ఇంత వరకు ఐఏవై పథకంలో ఇల్లు మంజూరు కాలేదు. మమ్మల్ని ఆదుకోవాలి.– పాలిని చినపెంటయ్య,బావాజీపేట, శ్రీకాకుళం జిల్లా.

మధ్యాహ్న వంట కార్మికులకు అన్యాయం
మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులకు కనీస వేతనం అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారు. నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. మమ్మల్ని ఆదుకోవాలయ్యా..
–  సువ్వారి అమ్మాయమ్మ, గట్టుముడిపేట

మరిన్ని వార్తలు