146వ రోజుకు చేరిన వేంపల్లె గ్రామస్తుల దీక్ష

7 Aug, 2015 15:54 IST|Sakshi

కర్నూలు(పాములపాడు): తమ గ్రామంలో పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేపట్టిన రిలే దీక్షలు 146వ రోజుకు చేరుకున్నాయి. కర్నూలు జిల్లా పాములపాడు మండలంలోని వేంపల్లె గ్రామంలో పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఈ నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం పవర్‌ప్లాంట్ నిర్మాణం నిర్ణయాన్ని విరమించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు