దుర్గమ్మ సేవలో లోక్‌సభ స్పీకర్‌

12 Feb, 2017 13:39 IST|Sakshi
(ఫైల్ ఫొటో)

విజయవాడ : లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన కనకదుర్గ అమ్మ వారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ ఈవో, వేద పండితులు ఘనస్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.

అనంతరం స్పీకర్‌ మాట్లాడుతూ.. కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు స్పీకర్‌ విజయవాడ వచ్చిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు