వైభవంగా పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు

30 May, 2015 08:13 IST|Sakshi

తిరుచానూరు (చిత్తూరు): తిరుచారూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవంలో తొలిరోజు రుక్మిణి, సత్యభామ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పపై పుష్కరిణిలో విహరించారు. అందులో భాగంగా రెండో రోజైన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత సుందరరాజస్వామికి అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం, రాత్రి 7.30 గంటల నుంచి తిరుచ్చి వాహనసేవ జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు