ఫ్లైఓవర్పై నుంచి కిందపడిన మిర్చీ లారీ

6 Mar, 2015 08:38 IST|Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుదురుపాడు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  మిర్చీ లోడుతో వెళ్తున్న లారీ ఫ్లైఓవర్పై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు