ప్రియుడు ఇంటి ఎదుట యువతి దీక్ష

30 Aug, 2018 10:37 IST|Sakshi
వివాహం జరిపిస్తున్న సీడీపీఓ, పోలీసులు

మార్కాపురం రూరల్‌ (ప్రకాశం): ప్రియుడి ఇంటి ఎదుట యువతి ధర్నా చేయగా అధికారుల చొరవతో వివాహం జరిగింది. ఈ సంఘటన మండలంలోని తిప్పాయపాలెంలో బుధవారం జరిగింది. సీడీసీఓ రమిజాభాను, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ తాజా మాజీ సర్పంచి కొర్రపోలు రామయ్య అదే గ్రామానికి చెందిన కొర్రపోలు కళావతిలు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి పదవి కాలం పూర్తి అయిన వెంటనే చేసుకుంటానని ఆమెను నమ్మించాడు.

పదవి కాలం పూర్తి అయినా ముఖం చాటేస్తున్నాడు. కళావతికి అనుమానం వచ్చి గత వారంలో ఆర్డీఓను మీ కోసం కార్యక్రమంలో కలిసి అర్జీ ఇచ్చింది. పెళ్లి చేసుకోవాలని యువతి బంధువులు అడుగుతున్నా అతడు పట్టించుకోలేదు. చేసేది లేక కళావతి తన కుటుంబ సభ్యులతో కలిసి రామయ్య ఇంటి ఎదుట దీక్షకు దిగింది. స్పందించిన సీడీపీఓ రమీజాభాను, పోలీసులు ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపారు. ఎట్టకేలకు పెద్దల సమక్షంలో చర్చిలో వివాహం చేశారు. కార్యక్రమంలో రైటర్‌ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ హారతి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు