ప్రేమజంటని రాజస్థాన్ తరలించిన పోలీసులు

28 May, 2015 12:25 IST|Sakshi
ప్రేమజంటని రాజస్థాన్ తరలించిన పోలీసులు

విజయవాడ: రాజస్థాన్ నుంచి పారిపోయి వచ్చి... విజయవాడ శివారులోని కానూరులో తలదాచుకున్న ఓ ప్రేమ జంటను ఆ రాష్ట్ర పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... రాజస్థాన్లోని పఠాన్జోన్సిరి మండలం బార్విన్న గ్రామానికి చెందిన పూరన్కుమారి, బాబూరాం గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ విషయం పెద్దలకు తెలిసింది. దాంతో వారిని కట్టడి చేశారు. దీంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా పారిపోయారు. ఆ క్రమంలో కానూరు వచ్చారు.

స్థానికంగా ఉంటున్న ఆదే గ్రామానికి చెందిన రత్నరాందేవసి ఇంట్లో కొన్ని రోజులుగా తలదాచుకుంటున్నారు. కాగా పిల్లలు ఆచూకీ తెలియకపోవడంతో వారివారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ప్రేమ జంట కానూరులో ఉన్నట్లు గుర్తించారు.  రాజస్థాన్ పోలీసులు కానూరు చేరుకుని ప్రేమజంటను గురువారం రాజస్థాన్ తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు