బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

23 Nov, 2014 20:02 IST|Sakshi

హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావం తమిళనాడుపై ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం మరింత బలపడనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 25నాటికి అల్పపీడనంగా మారవచ్చు. కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు పొడివాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలియజేశారు.

మరిన్ని వార్తలు