విశాఖః పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలహీనపడే అవకాశం ఉందన్ని వాతావరణ శాఖ వెల్లడించింది.రేపు కోస్తా ఆంధ్ర అంతటా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగురవేసినట్లు వాతావరణ శాఖ తెలపింది.