ఈ నెల16న అన్న ప్రసాద కేంద్రం కూడా మూసివేత : టీటీడీ

11 Jul, 2019 18:45 IST|Sakshi

సాక్షి, తిరుమల : ఈ నెల 16న రాత్రి 1.20 గంటలకు చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. 16న రాత్రి 7 గంటల నుంచి 17న ఉదయం 5గంటల వరకూ శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. 17న అర్చకులు ఆలయాన్ని శుద్ది చేసిన తర్వాత శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు. చంద్రగ్రహణ సందర్భంగా 16న అన్నప్రసాద కేంద్రాన్ని కూడా మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు