'బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టడం సరికాదు'

8 Mar, 2014 15:15 IST|Sakshi
'బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టడం సరికాదు'

హైదరాబాద్ : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య టీడీపీని సమర్థించటాన్ని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ తప్పుపట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. బీసీలను కేవలం ఓట్లుగానే చూసిన చంద్రబాబు వద్ద బీసీల గౌరవాన్ని ఆర్. కృష్ణయ్య తాకట్టు పెట్టడం సరికాదని మధుయాష్కీ వ్యాఖ్యానించారు. కాగా రంగారెడ్డి జిల్ల చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కృష్ణయ్య పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.
 

మరిన్ని వార్తలు