నేటి ముఖ్యాంశాలు..

18 Apr, 2020 06:52 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
ఏపీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 572కు చేరింది.
ఇప్పటివరకు 35 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
కరోనా బారినపడి ఇప్పటివరకు 14 మంది మరణించారు.
ఆసుపత్రుల్లో 528 మంది చికిత్స పొందుతున్నారు.

నేటి నుంచి గర్భిణులకు, చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు
స్లాట్‌ల వారీగా గర్భిణులకు, చిన్నారులకు టీకాలు వేయాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆదేశించారు.

పొదుపు సంఘాల మహిళలచేత..  కరోనా మాస్క్‌ల తయారీ
నేటి నుంచి మాస్క్‌ల తయారీ ప్రారంభం కానుంది
9 రోజుల్లో 16 కోట్ల మాస్క్‌ల తయారీకి కార్యచరణ

వైఎస్సార్‌ బీమా కింద నేటి నుంచి సెర్ప్‌ చెల్లింపులు

తెలంగాణ:
► తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 766కి చేరింది.
► ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు.
► కరోనా నుంచి కోలుకొని 186 మంది ఇంటికి వెళ్లారు.

జాతీయం: 
► దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,835కి చేరింది.
► ఇప్పటివరకు మొత్తం 452మంది వైరస్‌తో మృతి చెందారు.
► దేశవ్యాప్తంగా 1,766 మంది కోలుకున్నారు.
► దేశంలో 11,616  కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

అంతర్జాతీయం: 
► ప్రపంచ వ్యాప్తగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,18,758కి చేరింది.
► ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 1,51,966 మంది మృతి చెందారు.

మరిన్ని వార్తలు