నేటి ముఖ్యాంశాలు..

27 Mar, 2020 06:58 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌
తాడేపల్లి: నేడు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ
సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన ప్రత్యేక కేబినెట్‌ సమావేశం
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై చర్చించనున్న కేబినెట్‌
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు అందించే సేవలపై చర్చించే అవకాశం
బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ను ఆమోదించనున్న కేబినెట్‌

తూర్పుగోదావరి: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రైతు బజార్లు
జాయింట్‌ కలెక్టర్లకు మొబైల్ రైతుబజార్ల అనుమతులు మంజూరు చేసే అధికారం
ప్రతిరోజు కూరగాయల ధరలను ప్రకటించనున్న జాయింట్ కలెక్టర్లు

తెలంగాణ:
హైదరాబాద్‌: తెలంగాణలో 45కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
సికింద్రాబాద్‌ బౌద్దనగర్‌లో 45 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ

తెలంగాణలో నేటి నుంచి 12 కిలోల రేషన్‌ బియ్యం పంపిణీ
87 లక్షల 59వేల రేషన్‌కార్డు లబ్ధిదారులకు అందించనున్న ప్రభుత్వం
జనాలు గుమిగూడకుండా ఉదయం, సాయంత్రం బియ్యం పంపిణీ

అంతర్జాతీయం
ప్రపంచవ్యాప్తంగా 5.29 లక్షల కరోనా పాజిటివ్ కేసులు
కరోనాతో ఇప్పటివరకు 23,976 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న 1,23,380 మంది కరోనా రోగులు

ఇటలీ: ఇటలీలో 80,589 కేసులు, 8,215 మంది మృతి
స్పెయిన్‌లో 57,786 కేసులు, 4,365 మంది మృతి
చైనాలో తగ్గిన కరోనా మృతుల సంఖ్య
చైనాలో 81,285 కరోనా పాజిటివ్‌ కేసులు, 3,287 మృతి

అమెరికా: అమెరికాలో విజృంభిస్తోన్న కరోనా
అమెరికాలో 1,209కు చేరిన కరోనా మృతులు
అమెరికాలో 83,672 కరోనా పాజిటివ్‌ కేసులు 


 

మరిన్ని వార్తలు