నేటి ముఖ్యాంశాలు

29 Jun, 2020 06:35 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
అమరావతి: నేడు ఎంస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు విడుదల
క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..
కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడనున్న సీఎం జగన్
లాక్‌డౌన్‌తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంస్‌ఎంఈలు గట్టెక్కేందుకు..
తిరిగి కంపెనీలు ప్రారంభమయ్యేలా ఏపీ ప్రభుత్వం చర్యలు
గత ప్రభుత్వం చెల్లించని బకాయిలను నేరుగా ఎంఎస్‌ఎంఈల ఖాతాల్లో జమ
రీస్టార్ట్ కార్యక్రమం ద్వారా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్న ప్రభుత్వం

తిరుమల: నేటి నుంచి ఆన్‌లైన్‌లో జులై నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
టీటీడీ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
రోజుకు 9వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఇవ్వనున్న టీటీడీ
జులై సర్వదర్శనం టోకెన్లను రేపట్నుంచి ఇవ్వనున్న టీటీడీ
తిరుపతి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో సర్వదర్శనం టోకెన్లు
రోజుకు 3 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు

తూర్పుగోదావరి: నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి అనిల్‌కుమార్‌ పర్యటన
పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను సందర్శించనున్న మంత్రి అనిల్
అనంతరం రంపచోడవరం ఐటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం

తెలంగాణ:
హైదరాబాద్‌లో కేంద్ర బృందం పర్యటన
తెలంగాణలో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణ
నేడు ఉదయం 7 గంటల నుంచి 9 వరకు ఏదైనా కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ పరిశీలన
అనంతరం టీఎస్ సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ
గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్న కేంద్ర బృందం
తర్వాత టిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లనున్న కేంద్ర బృందం

హైదరాబాద్‌: సచివాలయాల భవనాల కూల్చివేతపై నేడు తుది తీర్పు
పాత సచివాలయం కూల్చివేత సవాల్ పిటిషన్లపై ఇప్పటికే హైకోర్టు విచారణ
నేడు తుది తీర్పు వెల్లడించనున్న తెలంగాణ హైకోర్టు

మరిన్ని వార్తలు