జి.మాడుగు: ఒక వ్యక్తిని దారుణంగా హత్యచేసి అతని తలను తీసుకెళ్లిన సంఘటన సోమవారం విశాఖ జిల్లా జి. మాడుగుల మండలంలోని చినకెళ్తారీ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వంజరీ పోతురాజు (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కొంతమంది గుర్తుతెలియని దుండగులు అతనిని గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున దారుణంగా హత్యచేశారు. అనంతరం మెండెం నుంచి తలను వేరుచేసి తీసుకెళ్లారు. ఈ ఘటనలో గ్రామంలో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, ఈ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.