చిట్టీల పేరుతో రూ.2 కోట్ల మోసం

3 Sep, 2015 18:21 IST|Sakshi

చెరుకుపల్లి : గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల కేంద్రంలో చిట్టీల పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.2 కోట్ల మేర స్థానికులకు టోపీ పెట్టాడు. దీనిపై సుమారు 80 మంది వరకు బాధితులు గురువారం సాయంత్రం చెరుకుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎం.రామదాసు అనే వ్యక్తి దగ్గర తాము చిట్టీలు వేశామని, కాగా గత రెండు నెలలుగా పాటలు పాడుకున్న వారికి డబ్బులు చెల్లించకుండా పరారీలో ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు