పాములపాడు: కర్నూలు జిల్లా పాములపాడు మండల కేంద్రంలో నితిన్రెడ్డి(18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. నితిన్రెడ్డి ఆత్మహత్యతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.