యువకుడి ఆత్మహత్య

4 Apr, 2016 12:53 IST|Sakshi

మార్కాపురం: రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పీఎస్ కాలనీకి చెందిన కె. పవన్(18) స్థానిక జ్యూస్ సెంటర్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఈ రోజు మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు