కొండపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

25 Dec, 2015 19:00 IST|Sakshi

విజయవాడ: కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గొల్లపాలెం క్వారీ కొండపై నుంచి జారిపడి ప్రమాదవశాత్తూ సింహ మధు(40) అనే వ్యక్తి మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

 

కొంతమంది కలిసి కొండపై పేకాటాడుతున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో తప్పించుకోబోయి కొండపై నుంచి జారిపడ్డారు. గాయపడిన ఇద్దర్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు