విద్యుత్ స్తంభం నుంచి జారిపడి వ్యక్తి మృతి

5 Aug, 2015 12:30 IST|Sakshi

గార : విద్యుత్ స్తంభం నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉప్పరపేటలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని సాలిహుండం గ్రామానికి చెందిన జల్లు వనజయ్య(48) అనే వ్యక్తి గ్రామంలో  విద్యుత్‌ స్తంభాలకు లైట్లు బిగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు