పిడుగుపాటుతో వ్యక్తి మృతి

4 Sep, 2015 16:21 IST|Sakshi

సత్తెనపల్లి (గుంటూరు) : పిడుగు పాటుతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని భట్లూరు గ్రామంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గేదెలు మేపుతుండగా పిడుగు పడింది. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు.

మరిన్ని వార్తలు