గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాదం

23 Sep, 2015 18:57 IST|Sakshi

హిందూపురం: గణేశ్ నిమజ్జనం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ అనే వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలొదిలాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణానికి చెందిన ప్రకాశ్ (35) నిమజ్జన వేడుకుల్లో పాల్గొన్నాడు. అయితే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలొదిలాడు. ప్రకాశ్కు భార్య, ఒక కూతురు ఉంది.

మరిన్ని వార్తలు