చిత్తూరు: చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం సామచింతలపల్లిలో ముని కృష్ణయ్య అనే వ్యక్తిని ప్రత్యర్థులు గత అర్థరాత్రి దారుణంగా హత్య చేశారు. దాంతో ఆగ్రహించిన కృష్ణయ్య బంధువులు ప్రత్యర్థులకు సంబంధించిన రెండిళ్లతోపాటు ఓ ట్రాక్టర్పై పెట్రోల్ పోసి గురువారం తగులబెట్టారు. అనంతరం నిందితులు శివతోపాటు మరో ఇద్దరు కుప్పం పోలీసు స్టేషన్లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముని కృష్ణయ్య మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.